అనుష్క సినీ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ పడినట్టేనా..?

NAGARJUNA NAKKA
అనుష్క తర్వాతి మూవీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అసలు సినిమాలు చేస్తుందా... పర్సనల్‌ లైఫ్ లో సెటిల్ అయిపోతుందా.. అందుకే సినిమాలు తగ్గించిందా అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం అనుష్క కెరీర్‌ చివరి దశకు చేరుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అనుష్క బరువు పెరిగాక సినిమాలు తగ్గిపోయాయి. 'భాగమతి' తర్వాత లాంగ్‌గ్యాప్‌తో రిలీజైన 'నిశ్శబ్ధం' సినిమా కూడా ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. పైగా స్వీటీ లుక్‌పై చాలా కామెంట్స్ వచ్చాయి. అనుష్కలో మునుపటి చార్మ్ తగ్గిపోయిందని, అస్సలు బాలేదనే విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి మరో మూవీకి సైన్ చేయలేదు స్వీటీ.
'జాతిరత్నాలు' సమయంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది. 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' టైటిల్‌తో ఆ సినిమా తెరకెక్కుతుందనే టాక్ వచ్చింది. యువి క్రియేషన్స్‌లో 'రారా క్రిష్ణయ్య' ఫేమ్ మహేశ్‌ ఈ సినిమాని డైరెక్ట్‌ చేస్తాడనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ పక్కకెళ్లిందని చెప్పుకుంటున్నారు సినీజనాలు.
అనుష్క మళ్లీ మునుపటి లుక్‌లోకి రావాలని ప్రయత్నిస్తోందట. కిలోల కొద్ది బరువుని తగ్గించుకున్న తర్వాతే మళ్లీ కెమెరాముందుకు రావాలనుకుంటోందట స్వీటీ. అందుకే ఈ 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి'ని పోస్ట్‌ పోన్ చేసిందని చెప్తున్నారు. అయితే కొందరు మాత్రం అనుష్క ఇంక సినిమాలు చేయడం కష్టమే, బరువు తగ్గి ఇప్పుడున్న హీరోయిన్లకి కాంపిటీషన్‌గా మారే సరికి వయసు అయిపోతుందని కామెంట్‌ చేస్తున్నారు.

అనుష్క లావు పెరిగినా... ఆమెపై అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. స్వీటీ మళ్లీ మేకప్ వేసుకోవాలని కోరుతున్నారు. వెండితెరపై జేజమ్మను చూడక చాలా రోజులయిందని ఫీల్ అవుతున్నారు. మరి అనుష్క బరువు తగ్గి మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడొస్తుందో చూడాలి. చూద్దాం... అనుష్క మళ్లీ మేకప్ వేసుకొని ప్రేక్షకులను అలరిస్తుందో లేదో. అలా అయితేనే ఆమె అభిమానులు సంతోషిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: