సింహా తో గర్జించిన బాలయ్య ... !!

GVK Writings
నటసింహం నందమూరి బాలయ్య తో 2010లో యాక్షన్, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తీసిన సెన్సేషనల్ మూవీ సింహా. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు పరుచూరి కిరీటి. మొదట దర్శకుడిగా రవితేజ తో భద్ర, అలానే వెంకటేష్ తో తులసి వంటి సూపర్ హిట్స్ కొట్టిన అనంతరం బాలయ్య కి సింహా మూవీ స్టోరీ చెప్పి ఒప్పించిన బోయపాటి, దానిని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు.
వాస్తవానికి అంతకముందు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం కెరీర్ పరంగా సతమతం అవుతున్న నందమూరి బాలకృష్ణకి, సింహా భారీ సక్సెస్ పెద్ద బ్రేక్ ని అందించింది అనే చెప్పాలి. దివంగత సంగీత దర్శకుడు చక్రి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటించగా కన్నడ నటుడు ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు విలన్స్ గా నటించారు. సీనియర్ నటి కేఆర్ విజయ, ఆలీ, నమిత, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, రెహమాన్ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాని భారీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి తీశారు.
ఇక బాలకృష్ణ ఈ సినిమాలో డాక్టర్ నరసింహా, లెక్చరర్ శ్రీమన్నారాయణ అనే రెండు పాత్రల్లో నటించి తన అద్భుత నటనతో ప్రేక్షకాభిమానులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పెర్ఫార్మన్స్, చక్రి అందించిన సాంగ్స్, నయనతార స్నేహ ఉల్లాల్ ల అందం, ఆకట్టుకునే నటన, భారీ ఫైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు వెరసి సింహా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసాయి. మొత్తంగా అంతకముందు కొన్నేళ్లుగా సక్సెస్ కోసం పరితపించిన బాలయ్య కి ఆయన ఫ్యాన్స్ కి ఈ సింహా మూవీ భారీ విజయం అన్ని విధాలా అమితానందాన్ని ఇచ్చింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: