క్రిస్మస్ కు పుష్ప డౌటే.. సుకుమార్ ఎందయ్యా ఇది?

P.Nishanth Kumar
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సుకుమార్ మొదటి పాటను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు ఓ పాటను విడుదల చేసిన చిత్రబృందం వీటి ద్వారా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడేలా చేసుకుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తొలిసారి అల్లు అర్జున్ రగ్ద్ లుక్కులో కనిపిస్తుండగా అది అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. సుకుమార్ సినిమా అంటేనే కథానాయకుడు వెరైటీగా కనిపిస్తూ అందరినీ అలరిస్తాడు ఆ విధంగానే ఈ సినిమాలో అల్లు అర్జున్ వెరైటీ రోల్ లో కనిపిస్తాడు అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. సంవత్సరాలకు సంవత్సరాలు సినిమాలు చేసి సుకుమార్ ఈ సినిమాను కూడా గత రెండు సంవత్సరాలుగా ఎడతెరిపి లేకుండా చేస్తూనే ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం అభిమానులను కొంత కలవరపెడుతోంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదటి భాగం కూడా పూర్తి కాలేదట రెండవ భాగం సంగతి పక్కన పెడితే ఈ విభాగం అయినా అనుకున్న సమయానికి వస్తుందా అని ఆరా తీస్తే అది కూడా కష్టమన తెలుస్తోంది . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నుంచి ఓ పాట విడుదల కాగా ఇది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. మరి సుకుమార్ అనుకున్న తేదీకి ఈ సినిమాను విడుదల చేసి మాట నిలబెట్టుకుంటా లేదా బన్నీ అభిమానులను మరొకసారి నిరాశ పరుస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: