బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాలో తమిళ స్టార్ హీరో..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో కెరియర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లూ, బ్లాక్ బస్టర్ లతో టాప్ హీరోగా ఎదిగాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ హీరో తన ఫామ్ ను కంటిన్యూ చేయడంలో కాస్త వెనుకబడి పోయాడు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ చివరిగా 'జీరో' అనే సినిమాలో హీరోగా కనిపించాడు. ఆనంద్.ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మరుగుజ్జు పాత్రలో కనిపించి షారుక్ ఖాన్ ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ చిత్రం తర్వాత షారుఖ్ ఖాన్ మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

 అందులో ‘రాకెట్రీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘బ్రహ్మాస్థ’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండగా 'పఠాన్' అనే చిత్రంలో రా ఏజెంట్ గా షారుక్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు షారుక్ ఖాన్ మొదటిసారి దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన దర్శకుడితో పని చేయబోతున్నాడు. ఆ తమిళ దర్శకుడే అట్లీ.  అట్లే ఇప్పటికే రాజా రాణి, తేరీ, మెర్సల్ , విజిల్ వంటి పలు బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియామణి, సునీల్ గ్రోవర్, సన్య మల్హోత్రా, యోగి బాబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఇదిలా ఉంటే వీరితో పాటే మరో దక్షిణాది హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో భాగం కానున్నాడు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: