అల్లు అర్జున్ కు చెల్లెలుగా యంగ్ హీరోయిన్..?

Pulgam Srinivas
దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు ఆర్య , ఆర్య 2 సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆర్య' సినిమా ఎంత విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయాన్ని కంటిన్యూ చేయడానికి వీరిద్దరూ కలిసి ఆర్య-2 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ హీరో పాహద్ పజిల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్రబృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా , ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.ఈ సినిమాను చిత్రబృందం రెండు భాగాలుగా విడుదల విడుదల చేయబోతున్నారు.

మొదటి పార్టు  ను డిసెంబర్ లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుండి ప్రస్తుతం మరో క్రేజీ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరో కు ఒక చెల్లెలు ఉంటుందట, ఆమె పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు అంత ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రకు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. హీరో ఎంతగానో ప్రేమించే తన చెల్లెలు  ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా చనిపోవడంతో ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని అన్వేషిస్తూ పుష్పరాజ్ అడవుల్లోకి రావడం. ఆ తర్వాత ఆసక్తికరంగా ఈ సినిమా కథ నడుస్తుంది అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: