అసలు బన్నీ కి ఏమైంది...? ఎందుకీ రచ్చ...?

Sahithya
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ ది ప్రత్యేక శైలి. మెగా హీరోలు అందరూ మెగాస్టార్ చిరంజీవి నీడలో పైకి వచ్చాము అనే భావనలో ఉండే అల్లు అర్జున్ మాత్రం తన సొంత టాలెంట్ తో పైకి వచ్చాను అనే అభిప్రాయంలో ఎక్కువగా ఉంటారు. అందుకే ఆయన మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటారు అన్న అభిప్రాయాలు కూడా మనం వింటూ ఉంటాము. టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రెండు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న అల్లు అర్జున్ అటు మలయాళంలో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం కూడా ఉంది.
ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మరింత దూరం జరిగారు అని ప్రధానంగా మెగా హీరోలతో ఆయన మాట్లాడటం లేదని ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడుతున్నారని టాలీవుడ్ లో ఎక్కువగా మనం కామెంట్స్ వింటున్నం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అనుసరిస్తున్న వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ కోసం కాకినాడ లో ఉన్న అల్లు అర్జున్ టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడిన సరే ఆయనను పరామర్శించలేదు.
మెగా హీరోలు అందరూ కూడా సాయి ధరంతేజ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేయడమే కాకుండా అపోలో ఆస్పత్రి వద్దకు వెళ్లి సాయి ధరంతేజ్ ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన సినిమా షూటింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో మెగా ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లారిటీ రాలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో అల్లు అర్జున్ తెరకెక్కిస్తారు. పుష్ప సినిమాను సంక్రాంతి నాటికి విడుదల చేసేందుకు ప్రణాళిక రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: