కొరటాల లో టెన్షన్.. ఎన్టీఆర్ సినిమా ఉంటుందా?

P.Nishanth Kumar
చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు కొరటాల శివ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాకు వెళ్లిపోవాలని భావిస్తున్నాడు.  నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా కూడా కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ముందుకు పోలేక వెనక్కి రాలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు.  మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన తదుపరి చిత్రాల చిత్రీకరణ కు వెళ్లిపోగా తాను మాత్రమే ఆచార్య ను పట్టుకుని వేలాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ తన సినిమా మొదలు పెట్టడానికి ఎంత తొందర పెడుతున్న కూడా కొరటాల శివ ఏమీ చేయలేక చూస్తూ ఉన్నాడు. దానికి తోడు ఎన్టీఆర్ కు కథ కూడా ఫిక్స్ కాకపోవడం మరింత టెన్షన్ పెడుతుంది శివ ను. వాస్తవానికి తన మొదటి సినిమా నుంచి కొరటాల శివ అన్ని ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వచ్చి భారీ హిట్ లను సంపాదించుకున్నాడు. తన బలమైన కథ విషయంలో ఏ విధంగా కాంప్రమైస్ అయ్యేవాడు కాదు. అలా చేసిన ఆయన ఇంత వరకు అన్ని బాగానే జరిగిన ఈ ఆచార్య సినిమా విడుదల కాకపోవడం  ఎన్టీఆర్ సినిమా పై ప్రభావం పడే విధం గా ఉండిం

తొందరగా ఆచార్య సినిమా చేసి ఎన్టీఆర్ సినిమా కథ పై కూర్చోవాలని అనుకున్న కొరటాల శివకు కరోనా అడ్డుతగలడం, ఇప్పుడు సినిమా విడుదల కాకపోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో , ఎన్టీఆర్ సినిమాకు కథ ఎప్పుడు లాక్ అవుతుందో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. మరి ఎన్టీఆర్ మనసు మార్చుకునే లోపే కొరటాల శివ కథను ఫిక్స్ చేసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: