మహేష్ బాబు దూకుడు ను చూపించిన శ్రీనువైట్ల

P.Nishanth Kumar
ఎంతటి పెద్ద హీరో అయినా కూడా వారి కెరీర్లో ఫ్లాప్ లు రావడం సహజం కానీ ఓ మంచి సినిమాతో మళ్లీ కం బ్యాక్ చేసి హిట్ కొట్టడమే కాకుండా ప్రేక్షకులను తమ సినిమాతో ఎంతగానో అలరిస్తారు. అందుకే వారు స్టార్ హీరోలు అయ్యారు. ఆ విధంగా మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు. ఆయన కెరీర్లో హిట్ సినిమాల కంటే ఎక్కువగా ఫ్లాప్ సినిమాలే చేసినా కూడా ప్రేక్షకులను మెప్పించడం లో మాత్రం ఆయన ఒక ఆకు ఎక్కువ తిన్నారని చెప్పవచ్చు.

సినిమాలు మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా మహేష్ బాబు నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు అని చెప్పవచ్చు.  ఆవిధంగా ఆయనకు వరస ఫ్లాప్ లు వస్తున్న సమయంలో ఓ సినిమా ఆయనను మళ్ళీ హీరోగా నిలబెట్టింది. పోకిరి సినిమా సెన్సేషనల్ హిట్ తర్వాత మహేష్ బాబు రేంజ్ మారిపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాయగా మహేష్ బాబుకు నెంబర్ వన్ స్థానం వచ్చేలా చేసింది ఈ సినిమా.  అయితే ఈ సినిమా చూసిన తరువాత ఆయనకు భారీ ఫ్లాప్ లు ఎదురయ్యాయి.

గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన సైనికుడు, ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన అతిధి, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఖలేజా ఇలా మూడు సినిమాలు వరుసగా భారీ ఫ్లాప్ లు కాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు కు భారీ హిట్ ను అందచేసింది. మహేష్ బాబు పోలీస్ గా రాజకీయ నాయకుడిగా కనిపించిన ఈ చిత్రంలో దర్శకుడు శ్రీను వైట్ల మహేష్ ను వేరే లెవెల్ లో చూపించగా కథ పాతదే అయినా కథనం లో కొత్తదనాన్ని చూపించి ప్రేక్షకులను పడేశాడు. సమంత హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: