లైగర్ పై మితిమీరిన విశ్వాసం !

Seetha Sailaja
టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు నాని నితిన్ లాంటి హీరోలు అంతా ధియేటర్ల పై నమ్మకంలేక తమ సినిమాలను ఓటీటీ లలో విడుదల చేస్తుంటే యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మాత్రం తన లైగర్ మూవీకి అత్యంత భారీ ఆఫర్లు ఓటీటీ సంస్థల నుండి వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ధియేటర్ విడుదల వైపు అడుగులు వేస్తున్నాడు.

ఇలాంటి ఆత్మ విశ్వాసం విజయ్ దేవరకొండకు ఏర్పడటానికి ఈమూవీ నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ విజయ్ కు ఇస్తున్న ప్రోత్సాహం అని అంటున్నారు. ఈమూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండను పాన్ ఇండియా లెవల్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రభాస్ తర్వాత విజయ్ అనేంతగా అతడిని ప్రమోట్ చేయాలనే ప్లాన్ లో కరణ్ జోహార్ ఉన్నట్లు టాక్.

అంతేకాదు విజయ్ ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో వరుణ్ ధావన్ ని పరిచయం చేసినంత స్థాయిలో విజయ్ ని ప్రమోట్ చేయాలని కరణ్ జోహార్ ప్లాన్ అని అంటున్నారు. ప్రస్తుతం ముంబాయ్ లోవిజయ్ దేవరకొండ కరణ్ జోహార్ తో కలిసి పార్టీ చేసుకునేంత చనువు ఏర్పడిందని వీరిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం విజయ్ చాలా కష్టపడ్డాడని ఈమూవీలో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త యాక్షన్ సీక్వెన్స్ లు చూస్తారని విజయ్ చాల నమ్మకంగా ఉన్నాడు.

వాస్తవానికి ఈమూవీకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మీ ఇప్పటి పరిస్థితులలో ‘లైగర్’ మూవీని ఓటీటీ కి ఇచ్చేయడం మంచిది అని భావిస్తున్నా ఈ వాదనతో కరణ్ జోహార్ అంగీకరించడంలేదు అని టాక్. అమితాబ్ నటించిన సినిమాలకు కూడ కలక్షన్స్ దేశవ్యాప్తంగా చాల తక్కువగా వచ్చిన పరిస్థితులలో విజయ్ కరణ్ జోహార్ అండ చూసుకుని మితిమీరిన సాహసం చేస్తున్నాడా అన్నసందేహాలు కూడ కొందరికి కలుగుతున్నాయి. ‘లైగర్’ మూవీతో తిరిగి ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చే అలవాటు చేసుకుంటారు అని చెపుతున్న విజయ్ ఆలోచనలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: