కోట్ల రూపాయలు పెట్టి కారు కొన్న ప్రభాస్ హీరోయిన్..?

Divya
టాలీవుడ్ లో కలిసిరాని హీరోయిన్లు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది హీరోయిన్లు వెళ్లిన వారు ఉన్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కృతిసనన్. ఆ తరువాత నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఇక ఈమె ఒకరి ఖరీదైనా కారు కోన్నది ఆ వివరాలను చూద్దాం.

టాలీవుడ్లో ఈమెకు ఏ సినిమా కూడా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఇక ఈమె టాలీవుడ్లో కేవలం రెండు సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ వైపుకు వెళ్ళిపోయింది. అక్కడ ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ అక్కడే సెటిల్ అయింది. తాజాగా "మీమీ" అనే సినిమా సక్సెస్ తో ఈమె ప్రభాస్ సరసన ఆదిపురుష్  సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదిలాఉండగా ఈమె..Mercedes-maybach gls 600 అని మోడల్ కారణం తనకు తానే గిఫ్టుగా ఇచ్చుకునది. ఈ కారు ఖరీదు సుమారుగా..2.5 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. సిని సెలబ్రిటీస్ ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం వీరికి కొత్తేమి కాదు. ప్రస్తుతం ఏదైనా మార్కెట్ లో కొత్త సార్లు వచ్చాయి అని తెలిస్తే చాలు సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు కృతిసనన్ కూడా ఒక కొత్త కార్లు తన సొంతం చేసుకుంది.
ఇక కృతిసనన్ సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం"మీమీ" అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటే"బచ్చన్ పాండే" గణపత్, భేదియా.. ఇక మరి కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా  ఇలా టాలీవుడ్ కలిసిరాకపోతే బాలీవుడ్ కు వెళ్లి అక్కడ తమ సత్తా చాటుతున్న భామలు ఎంతోమంది ఉన్నారు. ఇక అక్కడ వారు బాగా తన నటనను ప్రదర్శించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: