ఎన్టీఆర్ టార్గెట్ అదేనా .... ??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి ఫస్ట్ టైం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి వంటి భారీ విజయాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే అని నిన్న ఆర్ఆర్ఆర్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీని అనంతరం కొరటాల శివ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని నిర్మిస్తుండగా ఈ మూవీ కి అనిరుద్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా మరొక బిగ్ ప్రాజక్ట్ చేయనున్నారు ఎన్టీఆర్.
అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాల తరువాత కూడా యంగ్ టైగర్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే టార్గెట్ గా ముందుకు సాగనున్నట్లు చెప్తున్నారు. నిజానికి ప్రస్తుతం చరణ్ తో కలిసి ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ కనుక రిలీజ్ తరువాత బిగ్ సక్సెస్ కొడితే పాన్ ఇండియా హీరోలుగా తనకు చరణ్ కు క్రేజ్, మార్కెట్ విపరీతంగా పెరగడం ఖాయం అని ముందే గెస్ చేసిన ఎన్టీఆర్ ఇకపై ఈ విధంగా బిగ్ టార్గెట్స్ దిశగా ఎంతో జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. మరి మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్పకుండా మరింత భారీ స్థాయి క్రేజ్, మార్కెట్ ని దక్కించుకునే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: