బాలకృష్ణ సినిమాకు అదిరిపోయే టైటిల్ ను ఫిక్స్ చేసిన గోపీచంద్ మలినేని..!

Pulgam Srinivas
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న  'అఖండ'  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇదివరకు ఎప్పుడూ కనిపించని విధంగా రైతు గా , అఘోర గా రెండు విభిన్నమైన పాత్రల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో లను కూడా ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా , వీటికి జనాల నుండి మంచి స్పందన రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించక పోయినప్పటికీ ఈ చిత్రాన్ని ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను బోయపాటి శీను యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా లో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పటికే జరిగింది. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పొలిటికల్ లీడర్ గా , మరియు పోలీస్ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నాడు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు రౌడీయిజం అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: