బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ .... ??

GVK Writings
బాలకృష్ణ తో మొదటిసారి పదకొండేళ్ల క్రితం సింహా మూవీ తీసి సూపర్ హిట్ కొట్టారు బోయపాటి శ్రీను. ఆ మూవీలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించగా నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేసారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ అప్పట్లో పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఆ తరువాత నాలుగేళ్ళ అనంతరం మరొక్కసారి బాలయ్యతో బోయపాటి తీసిన సినిమా లెజెండ్.
రాధికా ఆప్టే, సోనా చౌహన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసారు బోయపాటి. ఇక మళ్ళి ఏడేళ్ల తరువాత మరొకసారి ప్రస్తుతం బాలయ్య తో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా అఖండ. బాలయ్య మధ్యతరగతి రైతుగా, అఘోరాగా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్స్ కి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో విడుదల చేద్దాం అని భావించిన యూనిట్, దానిని మరికొన్నాళ్లు వాయిదా వేసినట్లు టాక్. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్స్ విషయమై ప్రభుత్వం తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అది పూర్తిగా కొలిక్కి వచ్చి థియేటర్స్ పూర్తిగా తెరుచుకున్న తరువాతనే తమ మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నారట అఖండ యూనిట్. మరి ఇదే కనుక నిజం అయితే ఒకరకంగా ఇది బాలయ్య ఫ్యాన్స్ కి చేదు వార్తే అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: