ప్రభాస్ ను బాధపెట్టిన సందర్భం.. అందుకే ఇలా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమను ప్రపంచం మొత్తం గుర్తించేలా బాహుబలి సినిమా చేసి ఒక్కసారిగా దేశం మొత్తం మెచ్చుకునే హీరోగా మారాడు ప్రభాస్. ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాను మొదటగా విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయయి. ఇక ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా సలార్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఓవైపు కేజిఎఫ్ సినిమా విడుదలకు సిద్ధం చేస్తూనే మరో వైపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక ప్రభాస్ హీరోగా మరొక రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే సినిమా కూడా చేస్తున్నాడు. 

అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ పై జరిగిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒక సందర్భంలో ఆయన కెమెరా కంటికి చిక్కగా ఆ ఫోటోలో ప్రభాస్ బంగాళదుంపలా ఉన్నాడని బాగా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో. ఆంటీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విధమైన ట్రోల్ చయగా దానికి ప్రభాస్ చాలా ఫీల్ అయ్యాడట. ఆ విధంగా తనను ట్రోల్ చేసేసరికి ఎంతో బాధపడ్డారని ప్రభాస్ సన్నిహితుల వద్ద వాపోయారట.  అందుకే యుకెలో శస్త్రచికిత్స చేసుకోవడానికి వెళ్ళాడు అని తెలుస్తుంది. మరి ప్రభాస్ ను ఎంతో ఎంటర్టైన్ చేసే వ్యక్తిగా చూసే మనం ఆ విధంగా ట్రోల్ చేయడం సరి కాదని కొంతమంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: