ప్రభాస్ ను మించుతున్న రామ్ చరణ్ స్త్రాటజీ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పాన్ ఇండియా సినిమాలను అలవాటు చేసిన హీరో ప్రభాస్.  బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను మొదలుపెట్టగా ఇప్పుడు ఆయన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతు ఉండడం విశేషం. సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే రాధే శ్యామ్ సినిమా ను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా దేశవ్యాప్తంగా పలు భాషలలో ఈ చిత్రం విడుదల అవుతుంది.

అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న  సలార్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కాగా, బాలీవుడ్ లోనీ ఆడిపురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలు గా తెరకెక్కుతున్నాయి.  ప్రభాస్ చాలా అద్భుతంగా తమ సినిమాలను ప్లాన్ చేసుకొని దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రణాళిక చేసుకున్నాడని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతుండగా ఇప్పుడు దానికి మించిన స్ట్రాటజీ నీ ఉపయోగిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. 

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో కలసి ఓ భారీ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయితే మాత్రం ప్రభాస్ సరసన రామ్ చరణ్ చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో కూడా భారీ దర్శకుల తో తన సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలను కలిపి దాదాపుగా 1000 కోట్లు ఖర్చుపెట్టబోతున్నాడట. మరి రామ్ చరణ్ ఈ సినిమాల తర్వాత ఏ రేంజ్ కి చేరుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: