చరణ్ ఫ్యాన్స్ కి చమటలు పట్టిస్తోంది అదే .... ??
అయితే దీని తరువాత చేయనయున్న తన నెక్స్ట్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేసారు చరణ్. శంకర్ తీయనున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుండగా దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలు కూడ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో పలు సెట్టింగ్స్ వేస్తున్నట్లు టాక్. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురు ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి అయిందని, అలానే మూవీ మరొక నెలలో పట్టాలెక్కనుందని, అలానే వీలైనంత వేగంగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఈ భారీ మూవీ ని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట . ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇటీవల ఈ మూవీ స్టోరీ తనదే అంటూ చిన్నస్వామి అనే రచయిత తమిళ రచయితల సంఘంలో కేసు వేసిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఆ కేసు విషయమై పూర్తి విచారణ జరుగుతోందని, అయితే అది పూర్తిగా తమ స్టోరీనే అని దర్శకుడు శంకర్, ఆయన తో పాటు పని చేస్తున్న కార్తీక్ సుబ్బరాజ్ అంటున్నారట. అలానే ఈ కేసు నుండి బయట పడడంతో పాటు మూవీ అనుకున్న విధంగా తెరకెక్కి పక్కాగా టైంకి రిలీజ్ అవ్వడం ఖాయం అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇది వినడానికి బాగానే ఉన్నా తేడా వస్తే మాత్రం తమ హీరో రామ్ చరణ్ కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్లే అని, ఈ విషయమై చరణ్ ఫ్యాన్స్ కు లోలోపల కొంత ముచ్చెమటలు పడుతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా స్టోరీ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.