చూడబోతే బాలయ్య, చిరు వార్ తప్పేలా లేదు ... ??

GVK Writings
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి తీస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఇందులో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
మరోవైపు ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక సూపర్ సక్సెస్ లతో మంచి పేరు దక్కించుకుని టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్న కొరటాల శివ తో లేటెస్ట్ మూవీ ఆచార్య చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన కెరీర్ లో తొలిసారిగా కొడుకు రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు అలానే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తప్పకుండా తమ మెగాస్టార్ కి కొరటాల సక్సెస్ ఇవ్వడం ఖాయం అని వారు నమ్ముతున్నారు. మంచి మెసేజ్ తో పాటు యాక్షన్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.
అయితే మ్యాటర్ ఏమిటంటే రాబోయే అక్టోబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం కొద్దిరోజుల గ్యాప్ లోనే అటు మెగాస్టార్ ఆచార్య, ఇటు బాలయ్య అఖండ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా, ఆచార్య షూట్ అతి త్వరలో ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు సినిమాల మేకర్స్ దసరా రిలీజ్ పై గట్టిగా ఆలోచన చేస్తున్నారని, అలానే త్వరలో వీటికి సంబంధించి అధికారిక రిలీజ్ డేట్స్ కూడా రానున్నట్లు సమాచారం. మరి అదే కనుక నిజం అయితే చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్, బాలయ్య ల మధ్య బాక్సాఫీస్ తప్పదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: