ఆ సినిమాలతో పోటీ పడనున్న బాలయ్య..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద పోటీ ని చూసి చాలా కాలమే అవుతుంది. ఇది వరకు పండగ ఏదైనా వచ్చింది అంటే చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచి వాటి సత్తాను అవి చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించేవి. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులవల్ల బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేదు అని చెప్పవచ్చు. అయితే ఇది ఇలా ఉంటే వచ్చే సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ వద్ద మంచి పోటీ ఉండేలా కనబడుతుంది. ఇప్పటికే సంక్రాంతి ని టార్గెట్ చేసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కార్ వారి పాట' సినిమా సంక్రాంతికి తీసుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో పాటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాను కూడా సంక్రాంతి బరిలో ఉంచబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటిస్తున్నారుడు.

ఈ రెండు సినిమాలతో పాటు డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాదే శ్యామ్' సినిమాను కూడా సంక్రాంతి బరిలో ఉన్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇలా రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఫుల్ కాంపిటేషన్ ఉన్నట్లు మనకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇక రాబోయే దసరాకు కూడా అదేవిధంగా కాంపిటేషన్ ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఇప్పటికే దసరా బరిలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కొండపొలం' సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే రోజు అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా చిత్రబృందం థియేటర్ల లోకి తీసుకు రాబోతుంది. ఇలా ఈ రెండు సినిమాలు దసరా బరిలో నిలవగా వీరితో పాటే బాలయ్య బాబు కూడా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' సినిమాను దసరా బరిలో ఉంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త నిజం అయితే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ సంక్రాంతికి ముందే ప్రారంభం అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: