ఆ సన్నివేశాల కోసం గోవాకు బయలుదేరిన బాలయ్య..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా పూర్ణ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ' . ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ  రైతుగా,  ఆఘోర రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమాపై జనాల్లో అంచనాలు మొదటి నుండే భారీగా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం బాలకృష్ణ , బోయపాటి శీను కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన సింహ , లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన కలెక్షన్ల వర్షం కురిపించడమే. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి కొంత భాగం షూటింగ్ కోసం చిత్ర బృందం గోవాకు పయనం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను బోయపాటి శీను యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది . అన్నీ కుదిరితే ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ఈ హైడ్రాక్ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుంది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. బాలకృష్ణ ఈ సినిమా తో పాటు 'క్రాక్' సినిమాతో మంచి విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో హీరోగా నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: