సాయి ధరమ్ తేజ్ పై విజయశాంతి ప్రశంసలు..

Purushottham Vinay
ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ యంగ్ డైనమిక్ హీరో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన సినిమాలతో బాగా ఎంటర్టైన్ చేస్తూ తనకంటూ కూడా ఓ టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.ఇక సాయి నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ఆ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇక విషయానికి వస్తే..హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ నేతలు అలాగే టాలీవుడ్ సీనియర్ నటులు జూనియర్  హీరోలు అందరూ స్పందిస్తున్నారు.ఇక ఇప్పటికే పలువురు సినీ పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. మరికొందరు అయితే సోషల్ మీడియా వేదికగా సాయి ధరమ్ తేజ్ గురించి స్పందిస్తూ వున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే తెలుగు సీనియర్ నటి బీజేపీ నేత అయిన విజయశాంతి కూడా సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించడం జరిగింది. సాయితో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ అతన్ని ప్రశంసిస్తూ ఆమె ట్వీట్ చేశారు.ఇక సాయిధరమ్ తేజ్ ప్రవర్తనపై విజయశాంతి ప్రశంసలు వర్షం కురిపించడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ చాలా త్వరగా కోలుకోవాలని విజయశాంతి ఆకాంక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది.'సాయి ధరమ్ తేజ్ చక్కటి ప్రవర్తన సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన మంచి వ్యక్తి. ఇంకా మంచి ఆర్టిస్ట్. అతను సత్వరమే కోలుకోవాలని.. విజయవంతమైన సినిమాలను అందించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ' అని విజయశాంతి ట్వీట్ చేయడం జరిగింది.ఇక మెగా అభిమానులు కూడా సాయి త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.


https://twitter.com/vijayashanthi_m/status/1436635394217414657?s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: