రామ్ చరణ్,శంకర్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాదా!!

P.Nishanth Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తూనే మరోవైపు శంకర్ దర్శకత్వంలో మరొక భారీ పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇటీవలే అతిరథ మహారధులు సమక్షంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది ఈ సినిమా. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా లాంచింగ్ సందర్భంగా చిత్ర బృందం పోస్టర్ను విడుదల చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

తమిళంలో వరుస భారీ చిత్రాలను తెరకెక్కించిన శంకర్ తెలుగులో మొదటిసారిగా ఓ డైరెక్ట్ సినిమాను చేస్తున్నాడు. ఆయన చేసిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాద చిత్రాలు గా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా ఇప్పటికీ వారి కల నెరవేరింది. రావడంతోనే రామ్ చరణ్ లాంటి భారీ ఫ్యాన్స్ నీ కలిగి ఉన్న హీరో ని ఎంచుకోవడం ఒక్కసారిగా శంకర్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. 

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం మొదలు కాకముందే భారీ అంచనాలు పెట్టుకొని ఆ సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని వార్తలు రాగా ఇప్పుడు ఈ సినిమా ఆ బ్యాక్డ్రాప్ లో కాదని ఇటీవలే విడుదలైన పోస్టర్ ను బట్టి తెలుస్తుంది. పోస్టర్ లో  సూట్ వేసుకుని ఈ సినిమాలో నటించే నటీనటులు కనిపిస్తూ ఉండగా వారి చేతిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన లోగో ఉండడంతో ఈ చిత్రం నేపథ్యంలో  ఉండబోతుంది అని భావిస్తున్నారు. ఈ పోస్టర్ కోసమే శంకర్ భారీగా ఖర్చు పెట్టించాడు అని అంటున్నారు. మరి సినిమా కోసం ఇంకా ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అయినా కూడా అది ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: