అల్లు అర్జున్ వీరిని ఎందుకు ఊరిస్తున్నాడు!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప అనే పాన్ ఇండియా మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతుండగా మొదటి భాగం క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండవ భాగం వేసవి తర్వాత విడుదల చేద్దామని అనుకున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది అంటున్నారు.

అయితే అల్లు అర్జున్ ఈ రెండు భాగాల సినిమా తర్వాత తన తదుపరి చిత్రం విషయం లో కొంత జాప్యం చేస్తూ ఉండటం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తూ వస్తుంది. అందరు హీరోలు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు అనౌన్స్ చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం ఇలా చేస్తూ ఉండటం అసహనానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తదుపరి సినిమా వేణు శ్రీరామ్, బోయపాటి శ్రీను లతో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమని అంటున్నారు సినిమా విశ్లేషకులు. 

అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు దర్శకులు తమ కథలతో రెడీగా ఉన్నారని అల్లు అర్జున్ కావాలనే వారి సినిమాల విషయంలో లేట్ చేస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా తర్వాత కొరటాల శివతో అల్లు అర్జున్ సినిమా చేయాలి కానీ అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అనుకోకుండా ఒక్కసారిగా ఖాళీ అయిపోవడంతో తన ప్రణాళిక బెడిసికొట్టింది. కొరటాల శివ సినిమా చేసిన తర్వాత పాన్ ఇండియా దర్శకులైన ప్రశాంత్, రాజమౌళితో సినిమా చేయాలనుకున్నాడు. కానీ పుష్ప రెండు భాగాలుగా రావడం,  కొరటాల శివ సినిమా క్యాన్సల్ అయిపోవడం పని అంచనాలను తలకిందులు చేసింది దాంతో ఓ నార్మల్ దర్శకుడితో సినిమా చేయాల్సి అవసరం వచ్చింది. ఆ నేపథ్యంలోనే వీరిద్దరిలో ఎవరికి తీసుకోవాలన్న సందేహంలో అల్లుఅర్జున్ ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: