చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నా ప్రభాస్.. ఎందుకంటే..??

N.ANJI
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాధేశ్యామ్' సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాదు.. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో షూటింగ్ బిజీగా సాగుతుంది.
అంతేకాక.. ప్రభాస్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆది పురుష్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. అలాగే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు.
ఇక ఇప్పటికే పలువురు క్రేజీ స్టార్లతో ఈ సినిమాకు నేషనల్ క్రేజ్ వచ్చింది. అంతేకాక ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం.. ముంబైలో జరిగిన షూటింగులో ప్రభాస్ హాజరైయ్యారు. కాగా.. ఆ ఫోటోస్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై పట్టు కోల్పోయాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతేకాదు.. ప్రభాస్ ముఖమంతా వాడిపోయి.. విపరీతంగా లావెక్కినట్టు కనిపిచండంతో.. బహుబలి సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఫేస్ లో ఉన్న కల,లుక్,ఫిట్ నెస్..ఇప్పుడు లేవు అంటూ నెట్టిమట దీని పై భారీ డిస్ కషెన్స్ చేస్తున్నారు. దాంతో విసుగు చెందిన డైరెక్టర్ ప్రభాస్ కి బాడీలో సున్నితత్వం కనిపించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్పారంట. దీంతో అత్యవసరంగా లుక్‌ను, బరువును తగ్గించుకొంటే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు రెబల్ స్టార్. ఇక ప్రభాస్ యూకే వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: