చిరు కోసం అలాంటి కథ రెఢీ చేశాడట!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా త్వరలోనే విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫినిషింగ్ పనులను పూర్తి చేసే విధంగా దర్శకుడు కొరటాల శివ పని చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే చిరంజీవి తన మూడు చిత్రాలను సెట్స్ పైకి తీసుకు వెళుతున్నాడు.

మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ , మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరన్న సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధం గా ప్రణాళికలు రచిస్తున్నారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కానున్నాయి. ఈ చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే తన తదుపరి చిత్రాల విషయం లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. పలువురు యువ దర్శకు లు మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథలు చెప్పి ఒప్పిస్తా ఉండగా తాజాగా దర్శకుడు మారుతి మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేశాను అని చెప్పడం ఇప్పుడు మెగా అభిమానులు ఎంతగానో సంతోషపరుస్తుంది.

చిన్న సినిమాలతో తన కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ అవడానికి దూసుకుపోతున్నాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న మారుతి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనను కలిసి కథ వినిపించగా చిరంజీవి లైన్ బాగుందని చెప్పడం సమాచారం. పూర్తిస్థాయిలో ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తయారు చేయమని చిరు చెప్పగా మారుతి ఆ పనిలో ఉన్నాడట ఇప్పుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: