చైతు కాకుండా మరొకరితో సమంత గోవా ట్రిప్!!

P.Nishanth Kumar
ఇటీవలే కాలంలో అక్కినేని సమంత మరియు నాగచైతన్య ల మధ్య దూరం పెరిగిపోయిందని త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చెలరేగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోతున్నట్లు ఒక రేంజ్ లో రచ్చ జరుగుతున్న వీరి కుటుంబ సభ్యులు ఎవరు దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అనుమానాలను రేకెత్తిస్తుంది.  తమ విడాకుల వార్తలను పుట్టించిన వారిని మాత్రం సమంత కుక్కలతో పోల్చి ఈ గాసిప్ కి బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది. అయితే సమంత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నెటిజన్ నుంచి భారీ ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆమెను టార్గెట్ చేస్తున్నాడు.

తాజాగా అక్కినేని సమంత కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె చైతు తో కాకుండా మరో వ్యక్తితో వెకేషన్ కి వెళ్లడమే ఆమె కు సంబందించిన న్యూస్ వైరల్ అవ్వడానికి ముఖ్య కారణం. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దాంతో ఆమె వెకేషన్ కోసం గోవా వెళ్ళింది. అయితే ఆమె చైతు తో కాకుండా మరొకరితో వెళ్లడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె గురించిన వార్తలు ఎక్కువ అయ్యాయి. 

ఇంతకీ సమంతతో గోవా వెళ్లిన ఆ వ్యక్తి  ఎవరనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి అని తెలుస్తుంది. వీరు పబ్లిక్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి తీసిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకువడం తో వైరల్ గా మారింది. అయితే నాగచైతన్య ఈ వెకేషన్ లో ఎందుకు లేడు అనే దానికి కారణం ఉంది. లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యం లో ఈ సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడం తో ఆయన ఈ వెకేషన్ కి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆయన నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ లలో కూడా బిజీగా ఉండడంతో నాగచైతన్య అందుబాటులో లేడట. ఈ నేపథ్యంలో సమంత విడాకుల పై వార్తలు ఇకనైనా ఆగిపోతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: