సినిమాలు మాత్రమే కాదు బిజినెస్ లో కూడా రాణిస్తా అంటున్న శృతి హాసన్..!

Pulgam Srinivas
నేటితరం నటీనటుల ఆలోచనలు మారాయి. కేవలం సినిమాలలో నటించి జనాలను అలరించడం మాత్రమే కాకుండా , ఇతర రంగాలలో కూడా తమ తెలివిని , మేధస్సును ఉపయోగించి గొప్ప శక్తిగా ఎదగాలని వారు అనుకుంటున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ వారు ఇతర రంగాలలోకి ప్రవేశించి అందులో కూడా గొప్పపేరు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరరాయన అక్కినేని సమంత తనకు ఇష్టమైన ఫ్యాషన్ రంగంలో ప్రవేశించి 'సాకి' పేరుతో ఆన్ లైన్ స్టోర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఇలాగే ఒక బిజినెస్ రంగంలోకి ఎంటర్ కాబోతుంది .అయితే శృతి హాసన్ ఈ బిజినెస్ కేవలం డబ్బుల కోసం మాత్రమే కాకుండా తన ఇష్టాన్ని ,అభిరుచులను కూడా తన బిజినెస్ ద్వారా తీర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. శృతి హాసన్ చెన్నై అమ్మాయి అయినప్పటికీ ముంబైలో స్థిరపడింది. 

అక్కడి సౌత్ ఇండియన్ వంటకాల రుచిని బాగా మిస్ అవుతుందట, ఈ నేపథ్యంలో శృతి హాసన్ తన అభిరుచికి తగ్గట్టు, ముంబై లో నివసిస్తున్న సౌత్ ఇండియన్ జనాల కోసం ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ను నెలకొల్పాలని ఆమె ప్లాన్ లో ఉంది. ఇలా చేస్తే ఫుడ్ విషయంలో శృతి హాసన్ కు ఉన్న  కోరిక తీరడం తోపాటు, దక్షిణాది వంటకాలను ఇష్టపడే వారి కోరికను కూడా తీర్చినట్లు అవుతుందని శృతిహాసన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్యే చెన్నై మీడియాతో మాట్లాడిన శృతిహాసన్ ఆమె కోరికను బయటపెట్టడం మాత్రమే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
తనకు వంటల మీద మంచి పట్టు ఉందని, మంచి రుచులను జనాలకు చూపించడం అంటే ఇష్టం అని, అందుకే తనకంటూ ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే బాగుంటుందని ఈ ఆలోచన చేస్తున్నట్లు ఆమె తెలిపింది. తమిళ సాంబార్, ఆంధ్ర పప్పు, బెండకాయ కూర, ఉంటే సరిపోతుంది. జీవితాంతం వాటితోనే బతకవచ్చని, ఈ టేస్ట్ ను ముంబై లో ఉన్న ప్రజలందరికీ రుచి చూపిస్తాను అంటు శృతిహాసన్ తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: