అలా అనేవారు అంటూ.. కన్నీరు పెట్టుకున్న రోజా..?

Divya
రోజా ఈ పేరు అందరికీ సుపరిచితమే.బుల్లితెరపై కొన్ని షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక అందులో వేసే కమెడియన్ లకు దీటుగా ఈమె పంచులు వేస్తూ,ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది రోజా.ఇటు బుల్లితెరపై, అటు రాజకీయాలతో బిజీగా ఉంటుంది ఈమె.ఒక షోలో తనకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేస్తూ కన్నీరు పెట్టుకుంది రోజా.ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
వినాయక చవితి సందర్భంగా ఒక ప్రోగ్రాంను ఈటీవీ లో "ఊరిలో వినాయకుడు" అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. ఇక అందులో తన జీవితంలో జరిగిన కొన్ని దుర్ఘటన సంఘటనల తెలియజేసింది.తను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు పడిందో తెలియజేసింది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ షో లో అందరూ సరదాగా కామెడీ చేస్తూ ఉంటే.. చివర్లో రోజా మాత్రం అందర్నీ కన్నీరు పెట్టించేసింది.

1991 సంవత్సరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..2002 వరకు  హీరోయిన్ గా కొనసాగింది..అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించినదంతా అప్పులు కట్టడానికే సరిపోయింది అంటూ కన్నీరు పెట్టుకుంది రోజా. ఇలా తన జీవితం మొత్తం అప్పులు కట్టేకే సరిపోయిందని తెలియజేసింది.ఇక పెళ్లికి ముందు ఆమెను అందరూ పెద్ద ఫైర్ బ్రాండ్ అంటూ కామెంట్ చేసే వారని ఎమోషనల్ అయింది.

ఇక అంతే కాకుండా తనకు పిల్లలు పుట్టే యోగ్యం లేదంటూ కూడా కొంతమంది డాక్టర్లు తెలియజేశారని ఆమె చెప్పుకుంది.అలా ఎన్నోసార్లు చాలా బాధపడ్డాను అంటూ చెప్పింది. దేవుని దయవల్ల వివాహమైన సంవత్సరంలోనే తనకి అన్షు పుట్టిందని..అందుచేతనే అన్షు అంటే చాలా ఇష్టం అన్నట్లు గా చెప్పుకొచ్చింది రోజా. ఇక అక్కడే ఉన్న మరొక నటి ఇంద్రజ ఆమెను కన్నీరు తుడిచి కౌగిలించుకుంది.ఏ షోలో నైనా ఎప్పుడూ నవ్వుతూ ఉండే రోజా..ఇలా ఈ షోలో ఏడవడం తో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎవరైనా నిజాయితీగా ఉంటే, వారు తప్పకుండా విమర్శలను ఎదుర్కోక తప్పదు అంటూ ఆమె స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: