పాత కథనే తిప్పి తిప్పి మళ్లీ చెబుతున్నారు.. అనబెల్ సేతుపతి..!

Pulgam Srinivas
'ఝుమ్మంది నాదం' సినిమా తో వెండితెరకు పరిచయమైన తాప్సీ తెలుగులో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా అనేక సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకుంది. ప్రస్తుతం వరస సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ తాప్సి , ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారుతున్నట్లు ప్రకటించింది. తాప్సి బాలీవుడ్ పయనమైన తర్వాత దక్షిణాది సినిమాలలో నటించడం చాలా వరకు తగ్గించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడా అలరించడానికి 'అనబెల్ సేతుపతి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో తాప్సీ తో పాటు ఇండియా వైడ్ పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వీరిద్దరూ మాత్రమే కాకుండా జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, యోగి బాబు లాంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అయితే ఇలా ఎంతో మంది ప్రముఖ నటుల తో నిర్మించబడిన ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రముఖ 'ఓటీటీ' హాట్ స్టార్ లో టెలికాస్ట్ కాబోతుంది. అయితే ఆ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఆ ట్రైలర్ చాలా ఆసక్తిగా కొనసాగింది . ఈ ట్రైలర్ ప్రకారం 1948 లో ఒక రాజ మహల్ చుట్టూ కథ తిరుగుతుంది. చంద్రముఖి ,ఆనందో బ్రహ్మ సినిమాల ప్లేవర్ ఈ ట్రైలర్ లో కనిపించింది. దానికి తగ్గట్టుగానే ఈ ట్రైలర్ చివర్లో ఒక డైలాగ్ పెట్టారు. ఆ డైలాగులు తాప్సి కొత్త కథలు చెప్పకు అని అనడంతో.. కొత్త కథలు ఎవరు చెబుతున్నారు పాత  కథనే తిప్పి తిప్పి అదే చూపిస్తున్నారు అని యోగిబాబు అంటాడు. ఇలా సరదాగా సాగిపోయే ఈ ట్రైలర్ చాలా బాగుంది. మరియు ట్రైలర్ సినిమాలపై ఉన్న అంచనాలను మరింత పెంచింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: