స్వాతంత్య్రమా పాడుకో : వినరా వినరా దేశం మనదేరా..
1992 లో విడుదలయిన రోజా సినిమాలోని ది ఈ పాట. నాగుర్ బాబు పాడిన ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహ్మాన్ సంగీతం అందించాడు. అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన దేశభక్తి చిత్రం రోజా. ఇప్పటికీ ఆ సినిమా ప్రభావం భారత దేశభక్తి సినిమాలతో పాటు పౌరులపై కూడా ఉంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ పాట గురించి..
` వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా` అంటూ దేశం మనదే అంటూ రేపటి గురించి ఆలోచింపజేస్తుంది.
` నీ ఇల్లు ఆంధ్రదేశం అయినా
నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా` అంటూ నీది ఏ రాష్ట్రం, ఏ భాష అయినా మనం భారతీయులమేనని గుర్తు చేస్తుంది.
`తరం మారిన గుణమొక్కటే
స్వరం మారిన నీతోక్కటే
మతం మారిన పలుకొక్కటే
విల్లు మారిన గురి ఒక్కటే
దిశ మారిన వెలుగొక్కటే
లయ మారిన శ్రుతి ఒక్కటే
అరె ఇండియా అంటే ఒక్కటే లేరా..` అంటూ భారతీయులంతా ఒక్కటేనని నినదించింది.
`ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
రక్తంలో భారతత్వం ఉంటే చాలురా
ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా` అంటూ దిగులెందుకు భవిష్యత్తు ఉంది చాలా.. నీ రక్తం దేశప్రేమ ఉంటే చాలు భారతదేశమే నిన్ను రక్షిస్తుందని ధైర్యాన్నిస్తుంది.
`నవభారతం మనదేనురా
ఇది సమతతో రుజువాయెరా
మన ప్రార్థమే విలువాయెరా
నీ జాతికై వెలిగిందిరా
నిశిరాలనే మరిపించెరా
ఈ మట్టియే మన కలిమిరా లేరా..` అంటూ నవ భారత మనదేనని ఇది స్నేహంతో రుజువవునని ఇదే భరత జాతికి వెలుగయిందని దేశ మట్టే మన సర్వస్వం అని చాటింది ఈ పాట.
ఇలా ఈ సినిమాలోని అన్ని పాటలు శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నాయి.