నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను.. మీనా
అప్పట్లో వీరి నటన ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మీనా. గురించి.. ఈమె సీతారత్నం గారి మనవరాలు అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, స్టార్ హీరోలందరి సరసన నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సరసన అప్పట్లోనే ఎన్నో సినిమాలలో నటించి, తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది మీనా.. అలాగే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా చలామణి అయింది.
సినీ ఇండస్ట్రీలోకి మీనాను , వాళ్ళ అమ్మ ఎన్నో కఠినమైన రూల్స్ ను పెట్టి , సినీ ఇండస్ట్రీలోకి పంపించింది అట. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మీనా అమ్మ కూచి. అలాగే అమ్మకు చాలా భయపడేది. ఆమెతో సినిమా డేట్లు కావాలని ఎవరైనా అడిగితే, ముందుగా మీనా వాళ్ళను సంప్రదించాల్సిందే. మీనా వాళ్ళమ్మ ఎప్పుడు.. ఎలా చేయాలో.. చెప్తే మీనా అలాగే చేసేదట.. అలా వాళ్ళఅమ్మ మాట విని ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను వదులుకుంది మీనా..
అయితే అందులో రెండు అతి ముఖ్యమైన సినిమాలను వదులుకున్నందుకు ఇప్పటికి , కూడా మీనా బాధపడుతూనే ఉంటుందట. అవి ఏవో కాదు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్నే పెళ్లాడుతా సినిమా, ఆ తర్వాత రమ్యకృష్ణ నటించిన నరసింహ . ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర మొదట మీనాకు వచ్చింది. కాకపోతే వాళ్ళ అమ్మ డేట్స్ కుదరవని చెప్పడంతో ,ఈ సినిమాను కూడా మిస్ చేసుకుంది.