ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!

Pulgam Srinivas
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనుష్క శర్మ ,షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'రబ్ నే బనాదీ జోడీ'  సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కాయి. ఆ తర్వాత 'NH 10,  పీకే' లాంటి సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఇండియన్ స్టార్ క్రికెటర్ కోహ్లీ ని ప్రేమించి పెళ్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఈ ముద్దుగుమ్మ తన సినిమా జీవితం మరియు పర్సనల్ జీవితాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటుంది. కాసేపు ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్న పాట 'బచ్ పన్ కా ప్యార్ హై' ఎవరి నోట విన్నా , ఎవరి సోషల్ మీడియా అకౌంట్ లో చూసిన ఈ పాట వినిపిస్తుంది, కనిపిస్తుంది అంత క్రేజ్ తెచ్చుకున్న ఈ పాటను పాడింది చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో ఈ బాలుడు ఈ పాటను తన పాఠశాలలో పాడాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.


 ఈ వీడియోను చూసిన చాలా మంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఈ పాట పై ప్రశంసలు చేస్తున్నారు. తాజాగా ఈ పాటకు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఫిదా అయిపోయింది. ఈ మేరకు ఈ బుధవారం అనుష్క శర్మ ఫన్నీ మీమ్‌ షేర్ కూడా చేశారు. రాత్రిపూట ప్రశాంతంగా పడుకుందామని కొనే లోపే 'బచ్‌పన్‌ కా ప్యార్‌ హై'పాట నా నోట్లోనే నానుతోంది. అని తెలిపే ఈ విధంగా ఓ మీమ్ ని షేర్ చేశారు. ఎంత ప్రయత్నించినా ఈ పాట నా మెదడులో నుంచి పోవడం లేదు అన్నట్లుగా ఒక పోస్ట్ చేశారు. అనుష్క శర్మ ప్రస్తుతం విరాట్‌ తో కలిసి బ్రిటన్ లో ఉంది. కాగా ఈ పాటను జూలై 3న షేర్ చేయగా ఇప్పటివరకు 9 మిలియన్ వ్యూస్ ను సాధించింది. తాజాగా ఈ పాట పాడిన బాలుడికి చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘేల్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: