స్వీటీ సినిమాకు డార్లింగ్ వాయిస్ ఓవర్ ?

VAMSI
 టాలీవుడ్ లో కొన్ని స్టార్ జోడీలకు ఉన్న క్రేజ్ ను మాటల్లో చెప్పడం కుదరదు. అలాంటి కాంబో లిస్టులో హీరో ప్రభాస్ అనుష్క ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే బాహుబలి సినిమా తర్వాత అనుష్క, ప్రభాస్ పేర్లు అఫీషియల్ గా ఏ సినిమాలోనూ వినిందే లేదు. వీళ్లిద్దరు కలిసి ఆ సినిమాలో నటించబోతున్నారు, ఈ సినిమాలో చేస్తున్నారు అంటూ రూమర్స్ వినిపించాయి. కానీ, ఒకటి కూడా తెరపై కనబడలేదు. అసలు బాహుబలి చిత్రం తర్వాత స్వీటీ సినిమాలు చేయడం బాగా తగ్గించారు. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు మాత్రమే సైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. భాగమతి, నిశ్శబ్దం సినిమాల తర్వాత ఏ ప్రాజెక్ట్ కి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. అయితే ఇటీవల జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేయబోతుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వెలువడ్డాయి.
అనంతరం ఈ సినిమా క్యాన్సిల్ అయింది అన్న కథనాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఇట్టే ఆకర్షించేలా ఉంది. అసలు సోషల్ మీడియానే ఈ వార్త షేక్ చేస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ల సినిమా క్యాన్సిల్ కాలేదని సమాచారం. అయితే అసలు విషయం వేరే ఉంది. అదేంటంటే ఈ చిత్రానికి డార్లింగ్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటూ మేకర్స్ ప్రభాస్ ని రిక్వెస్ట్ చేయడంతో బాహుబలి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 ఈ వార్త నిజంగా తెలుగు ప్రేక్షకులకు ఒక వరం లాంటిదే. వెండితెరపై ప్రభాస్ అనుష్క చాలా కాలంగా  జంటగా కనబడకపోయినా, కనీసం ఇలా అయినా  వీరిని తెరపై చూసి, అనుష్క సినిమాకు ప్రభాస్ స్వరం వినే అదృష్టం కలగబోతోంది అంటూ సంబరపడిపోతున్నారు అభిమానులు. ఈ వార్త ఖచ్చితంగా నిజం అవ్వాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: