స్వీటీకి బ్యాడ్ టైమ్..!
అనుష్క ఏమని సైజ్ జీరో కోసం బరువు పెరిగిందో అప్పటి నుంచి సినిమాలు తగ్గిపోయాయి. ఫుల్ బిజీగా ఉండే ఆమె కెరీర్ స్లో అయిపోయింది. ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఆమె ముందు క్యూ కట్టేవి. 'భాగమతి' తర్వాత లాంగ్గ్యాప్తో రిలీజైన 'నిశ్శబ్ధం' సినిమా కూడా ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. పైగా స్వీటీ లుక్పై చాలా కామెంట్స్ వచ్చాయి. అనుష్కలో మునుపటి చార్మ్ తగ్గిపోయిందని, అస్సలు బాగోలేదనే విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి మరో మూవీకి సైన్ చేయలేదు స్వీటీ.
'జాతిరత్నాలు' టైమ్లో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది. 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' టైటిల్తో ఆ సినిమా తెరకెక్కుతుందనే టాక్ వచ్చింది. యువి క్రియేషన్స్లో 'రారా క్రిష్ణయ్య' ఫేమ్ మహేశ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ పక్కకెళ్లిందని చెప్పుకుంటున్నారు సినీజనాలు.
అనుష్క మళ్లీ మునుపటి లుక్లోకి రావాలని ప్రయత్నిస్తోందట. కిలోల కొద్ది బరువుని తగ్గించుకున్న తర్వాతే మళ్లీ కెమెరాముందుకు రావాలనుకుంటోందట స్వీటీ. అందుకే ఈ 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి'ని పోస్ట్ పోన్ చేసిందని చెప్తున్నారు. అయితే కొందరు మాత్రం అనుష్క ఇంక సినిమాలు చెయ్యడం కష్టమే, బరువు తగ్గి ఇప్పుడున్న హీరోయిన్లకి కాంపిటీషన్గా మారే సరికి వయసు అయిపోతుందని కామెంట్ చేస్తున్నారు. మరి అనుష్క బరువు తగ్గి మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడొస్తుందో చూడాలి.దీనికోసమే అనుష్క అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.