ఈ మామ అల్లుళ్ళు కలిసి ప్రభాస్ ను ఏం చేస్తారో?

P.Nishanth Kumar
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వాటిలో మొదటగా రాధేశ్యామ్ రిలీజ్ అవుతుండగా ఆ తర్వాత సలార్ ఆ తర్వాత ఆదిపురుష్, ఆ తర్వాత నాగ్ అశ్విన్ ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. రాధే శ్యామ్ సినిమా జూలై 30న విడుదల కాబోతుండగా ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పునర్జన్మల నేపథ్యం లో అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిందని అంటున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రంతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సలార్ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండగా రామాయణం ఆధారంగా బాలీవుడ్ సినిమా ఆది పురుష్ తెరకెక్కుతోంది అని ఇప్పటికే అందరికీ తెలుసు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న డం విశేషం. ఇక టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ నాగ్ అశ్విన్ ల సినిమా. దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా బాహుబలిని మించి పోవాలన్నా పట్టుదలతో నిర్మిస్తున్నారట వైజయంతి మూవీస్ బ్యానర్ వారు.
నాగ్ అశ్విన్ మామ అశ్వినీ దత్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుంది అని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ యాక్టర్ విలన్ గా నటించబోతున్నాడట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో దాదాపు 10 మంది అగ్ర నటులు బాలీవుడ్ నుంచే రాబోతున్నారని, వారందరికీ కలిపి పారితోషికం రెండు వందల కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా 500 కోట్ల రూపాయల బడ్జెట్ ను టచ్ అవుతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే మామా అల్లుళ్లు ప్రభాస్ ని ఎవరెస్ట్ పై కూర్చోబెడతారు అనే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: