చిరూ, బన్నీ, మహేష్ లే కాదు.. చివరికి నాగ చైతన్య కూడా ఆపేసాడు..!!

Anilkumar
కరోనా కారణంగా ఇప్పటికే సినీ పరిశ్రమకి భారీ నష్టం వాటిల్లింది.. ఇప్పుడు మరోసారి కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్లు మధ్యలోనే ఆగిపోయాయి..ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన మొదటి సినిమా షూటింగ్ ఆచార్య.మెగాస్టార్ చిరంజీవి హీరోగా..కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న సోనూ సూద్ కొవిడ్ బారిన పడడం.. ఆ సమయంలోనే కొవిడ్ ఉధృతి పెరగడంతో షూటింగ్ కు రెడ్ సిగ్నల్ చూపించారు చిరు.


ఆ తర్వాత సూపర్ మహేష్ 'సర్కారువారి పాట' షూటింగ్ కూడా ఆగిపోయింది.మహేష్ సరసన కీర్తీ సురేష్ కథానాయిక నటిస్తున్న ఈ సినిమా  యూనిట్లో కొందరితోపాటు మహేష్ పర్సనల్ స్టైలిస్ట్ కూడా కొవిడ్ బారిన పడడంతో.. ప్రిన్స్ క్వారంటైన్లోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ విధంగా.. సినిమా షూటింగులన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోయాయి.రన్నింగ్ లో ఉన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటున్న చిత్రాలు.. ఆ తర్వాత ప్యాకప్ చెప్పేయడం మొదలు పెట్టాయి. అయితే.. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లోదిల్ రాజు నిర్మిస్తున్న 'థాంక్యూ' సినిమా మాత్రం షెడ్యూల్ మధ్యలోనే నిలిచిపోవడం గమనార్హం. విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ ఇటలీలో జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ పాల్గొనాల్సి ఉంది.


 అయితే.. ఆయన ఇండియా నుంచి బయల్దేరడం ఒకరోజు ఆలస్యమైందట. ఈలోగానే భారత్ నుంచి వచ్చే విమానాలపై ఇటలీ సర్కారు ఆంక్షలు విధించింది. దీంతో.. థాంక్యూ షూటింగ్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో.. పుష్ప చిత్రం కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం.. రెండు మూడు సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. అవి కూడా ప్రజెంట్ షెడ్యూల్ ఫినిష్ కాగానే.. ప్యాకప్ చెప్పేస్తాయి. ఇక, తిరిగి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి..ఒకవేళ షూటింగ్ మొదలైనా.. విడుదలకు మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది..!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: