కరోనా ఎఫెక్ట్: స్టార్ హీరోయిన్ల పారితోషికంలో కోత ఎంతో తెలుసా..?

N.ANJI
దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా కారణంగా టాలీవుడ్ లో పరిస్థితులు అన్ని తలకిందులైయ్యాయి. ఇక నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చేసాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్నాళ్లు టైమ్ పడుతుంది. అప్పటి వరకు రెమ్యునరేషన్స్ విషయంలో కూడా కోత తప్పదు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మరో అనుమానం లేకుండా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈమె పారితోషికం కూడా 2 కోట్లకు పైమాటే. ఇక పారితోషికం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. ప్రభాస్ రాధే శ్యామ్‌తో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తుంది పూజా. ఇకపై ఒప్పుకోబోయే సినిమాల కోసం హీరోలను బట్టి పారితోషికం తీసుకుంటుంది పూజా.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా తన పారితోషికంలో స్వచ్ఛందంగా కోత పెట్టుకుందని తెలుస్తుంది. విరాట పర్వంతో పాటు లవ్ స్టోరీ సినిమాల కోసం తను తీసుకునే దానికంటే కూడా తక్కువగానే అందుకుంటుంది ఈమె. ఇక సమంత ఇప్పుడు కూడా సినిమాకు 2 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు సమంత. ఒకవేళ ఒప్పుకున్నా కూడా రెమ్యునరేషన్ కట్ చేసుకోడానికి సిద్ధంగానే ఉంది. పైగా డిజిటల్ మీడియాలో తన సత్తా చూపిస్తుంది సమంత.
స్టార్ హీరోయిన్ నయనతార రేంజ్ కూడా ఇప్పుడు భారీగానే పడిపోయింది. ఒకప్పుడు వరస సినిమాలు చేసి దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసిన ఈమె. కరోనా ప్రభావంతో చాలా వరకు తన రేటులో రిబేటు ఇచ్చిందని తమిళ చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. రెండో సినిమాకు 30 లక్షల వరకు తీసుకుంటుంది. కరోనా కారణంగా 30 నుంచి 40 లక్షల వరకు మాత్రమే అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: