ఎన్టీఆర్‌కి నో.. రామ్ చరణ్ కి ఎస్ చెప్పిన మహేష్ హీరోయిన్..!?

Suma Kallamadi
ప్రముఖ స్టార్ హిందీ హీరోయిన్ కైరా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014లో ఫగ్లీ సినిమాలో హిందీ సినీ పరిశ్రమకు పరిచయమైన ఆమె తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి మెప్పుపొందింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని (ది అన్ టోల్డ్ స్టోరీ) సినిమా వల్ల మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ సినిమాలో విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ మార్క్ దక్కించుకున్నారు. లస్ట్ స్టోరీస్‌లో కైరా అద్వానీ యాక్టింగ్‌కి అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల సంఖ్య పెరుగుతూ వచ్చాయి.
2018లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ప్రముఖ స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ల సరసన చేరారు. ఈ సినిమా తర్వాత మరో స్టార్ హీరో రామచరణ్‌తో కలిసి నటించింది. వినయ విధేయ రామ సినిమా కమర్షియల్ హిట్ దక్కించుకుంది. ఈ సినిమాలో కూడా తన అందచందాలతో ప్రేక్షకుల మెప్పును పొందారు.
తాజాగా కైరా అద్వానీని  జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కైరా నో చెప్పిందట. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్న కారణంగా బిజీ ఉన్నానని, సినిమా చేయడం కుదరదన్నారు. కానీ, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాకు కైరా ఓకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ కైరాపై మండి పడుతున్నారు. ఎన్టీఆర్ సినిమాను కాదని, రాజ్ చరణ్ సినిమాకు ఓకే ఎలా చెప్పందని కోపగించుకుంటున్నారు. ఈ సమయంలో కైరా తెలుగు పరిశ్రమలో రాణిస్తుందా అనే విషయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని చేతులారా వదులుకుంటోందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: