ఎన్టీఆర్కి నో.. రామ్ చరణ్ కి ఎస్ చెప్పిన మహేష్ హీరోయిన్..!?
2018లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ప్రముఖ స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ల సరసన చేరారు. ఈ సినిమా తర్వాత మరో స్టార్ హీరో రామచరణ్తో కలిసి నటించింది. వినయ విధేయ రామ సినిమా కమర్షియల్ హిట్ దక్కించుకుంది. ఈ సినిమాలో కూడా తన అందచందాలతో ప్రేక్షకుల మెప్పును పొందారు.
తాజాగా కైరా అద్వానీని జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కైరా నో చెప్పిందట. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్న కారణంగా బిజీ ఉన్నానని, సినిమా చేయడం కుదరదన్నారు. కానీ, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాకు కైరా ఓకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ కైరాపై మండి పడుతున్నారు. ఎన్టీఆర్ సినిమాను కాదని, రాజ్ చరణ్ సినిమాకు ఓకే ఎలా చెప్పందని కోపగించుకుంటున్నారు. ఈ సమయంలో కైరా తెలుగు పరిశ్రమలో రాణిస్తుందా అనే విషయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని చేతులారా వదులుకుంటోందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.