అందరి నోటా 'స్వప్న సినిమా' మాటే.. పీహెచ్డీ ఏమన్నా చేశారా ?

Chaganti
అవును నిజమే స్వప్న సినిమాస్ బ్యానర్ మీద జాతి రత్నాలు అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ స్వప్న సినిమా బ్యానర్ ఎవరిదంటే అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ దే. గతంలో ఈ బ్యానర్ మీదనే మహానటి సినిమా నిర్మించారు. ఇప్పుడు జాతి రత్నాలు అనే సినిమాను కూడా అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో ఏ సినిమాకి చేయనటువంటి విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది స్వప్న సినిమా బ్యానర్. మంచి క్రేజ్ లో ఉన్న ప్రభాస్ తో ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేయించారు. నిజానికి ట్రైలర్ రిలీజ్ బడా హీరోలు చేయటం అనేది పెద్ద విషయమేమీ కాదు. 

కానీ ఆ ట్రైలర్ రిలీజ్ చేయించుకోవడానికి గాను ఇక్కడి నుంచి ముంబై వెళ్లే వరకు కూడా ఒక వ్లాగ్ లాగా చేసి ప్రేక్షకులకు ఆసక్తికరంగా అందించిన ఈ సినిమా యూనిట్. అలాగే మరో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్నాడు. నిజానికి నవీన్ పోలిశెట్టి, నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ వీళ్లందరూ కలిసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి  పని చేశారు. అప్పటి పరిచయంతో పిలవగానే విజయ్ దేవరకొండ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడు. 

అయినా ఈ జాతి రత్నాలు సినిమాని ఆఖరికి పోలీసులు సైతం ప్రమోట్ చేయడం అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి పోలీసులు కాస్త ఆసక్తికరంగా ఉన్న అన్ని అంశాలను ఉపయోగించుకుంటూ జనాల్లో ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జాతిరత్నాలు కు సంబంధించి కొన్ని మీమ్స్ కూడా పోలీసులు పోస్ట్ చేశారు. అది కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ఉపయోగపడింది. అందుకే వీళ్ళు ప్రమోషన్స్ లో ఏమైనా పీహెచ్డీ చేశారా అంటూ ఈ సినిమా యూనిట్ మీద నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: