ముఖ్యమంత్రుల ఇంటికి కోడళ్ళు గా వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే

Mamatha Reddy
వెండితెరపై ఎంతో మంది హీరోయిన్లు ఒక మెరుపు మెరిసి తరువాత పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యి కనుమరుగయ్యారు.మరి కొంతమంది హీరోయిన్స్ అయితే  రాజకీయాల్లోనూ రంగప్రవేశం చేశారు. కొంతమంది హీరోయిన్స్  రాజకీయలలో పేరు ఉన్న  కుటుంబాలకు కోడళ్లుగా వెళితే, మరి కొందరు ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రుల భార్యలుగా,  కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు గా ఇప్పటికి ప్రజల మధ్య తిరుగుతూ వారికి చేరువలో ఉంటున్నారు.
వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటీమణులలో జయలలిత ఒకరు. సినిమా రంగం తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టి  తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని రెండు సార్లు అధిరోహించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అలాగే మన మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబంలో మరో హీరోయిన్ ఉన్నారు. కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక కూడా ఒకప్పుడు హీరోయిన్ గా నటించారు. కన్నడ పరిశ్రమలో రాధిక అందరికీ సుపరిచితురాలే. 2006లో ఆమె కుమారస్వామిని పెళ్లాడారు. వీరికి ఓ కూతురు ఉంది. రాధికా కుమారస్వామి  ప్రస్తుతం ఆమె మాజీ ముఖ్యమంత్రి భార్య హోదాలో ఉన్నారు. అలాగే మన అందరికి బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించిన హీరోయిన్ జెనీలియా కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది. రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  తర్వాత రితేశ్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్  కోడలిగా స్థిరపడిపోయింది.  

ఇప్పుడు   హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కూడా  మాజీ ముఖ్యమంత్రి ఇంటికి కోడలుగా వెళ్లనుంది.  మాజీ ముఖ్యమంత్రి మనవడుని వివాహం చేసుకోబోతోంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్  మనవడుని పెళ్లాడనుంది. మార్చ్ 13 న రాజస్థాన్ లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఇద్దరి ఎంగేజ్ మెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   ఇలా మన హీరోయిన్లు రాజకీయాల్లో రాణిస్తూనే  ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రుల ఇళ్లకు కోడళ్లుగా అడుగుపెట్టే లక్కీ ఛాన్స్ కొట్టేసారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: