ముకుంద లో అంతుచిక్కని రహస్యం !

Seetha Sailaja
నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ముకుంద’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ ‘కుర్రాళ్లం కదా ఉడుకురక్తం మాకు పెద్దగా నిద్రలు పట్టవు’ బాగా మెగా అభిమానులలోకి చొచ్చుకు పోయింది. మొట్టమొదటి సినిమాతోనే విలన్ రావు రమేష్ చేత వరుణ్ తేజ్ ఫీచర్స్‌ని హైలెట్ చేస్తూ చెప్పించిన డైలాగ్స్ ఈ సినిమా విడుదల కాకుండానే వరుణ్ తేజ్ క్రేజ్ ను పెంచుతున్నాయి.  ఈ నెల 24వ తారీఖున క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపిస్తాడు అన్న విషయం తెలిసిందే. ఈవార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో రెండు నిముషాలపాటు ఒక ప్రత్యేక పాత్రలో ఒక మెగా హీరో కనిపించబోతున్నాడు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.  ఈ వార్తలను ఈ సినిమా యూనిట్ ఖండించక పోవడంతో ఇప్పుడు ఈ సినిమాలో కనిపిoచబోయే మెగా హీరో ఎవ్వరు అనే ఊహగానలు ఊపు అందుకున్నాయి. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించ బోతున్నది రామ్ చరణ్ అని కొందరు చెపుతూ ఉంటే మరికొందరు అల్లు అర్జున్ అని అంటున్నారు.  ముకుంద లో కనిపించబోయే ఈ మెగా హీరోలలో ఎవరో ఒకరు అయినా ఈ సినిమాకధకు సంభందం ఉండేటట్లుగా ఈ రెండు నిమిషాల మెగా హీరో పాత్రను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మలిచాడు అని టాక్. అదే విధంగా ఈ సినిమాలో వచ్చే రెండు సందర్భాలలో వరుణ్ తేజ్ తన డైలాగుల మధ్య చిరంజీవి, పవన్ ల ప్రస్తావన తీసుకు వస్తాడు అనే వార్తలు కుడా వస్తున్నాయి. ఇలా ఎన్నో ఊహించని ట్విస్టులు ‘ముకుంద’ లో ఉన్నాయని ఊన్నాయని ఫిలిం నగర్ టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: