ఓటీటీలకు కొత్త ఊపు !

NAGARJUNA NAKKA
లస్ట్ స్టోరీస్. వెబ్ సిరీస్ లను  ఫాలో అయ్యే యూత్ కు ఈ ఫ్రాంచైజ్ బాగా గుర్తుంటుంది. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీలకు ఇది కొత్త ఊపు తెచ్చింది. తాజాగా తెలుగులోను ఇదే పేరుతో రీమేక్ అవుతుంది. అక్కడ నలుగురు డైరెక్టర్స్ హ్యాండిల్ చేసినట్లే..ఇక్కడ ఓ నలుగురు దర్శకులు టేకప్ చేయబోతున్నారు. అయితే ఉన్నట్టుండి వారిలో ఒకరు తప్పుకోవడంతో వచ్చే ఆ కొత్త దర్శకుడు ఎవరా అని నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు.
లస్ట్ స్టోరీస్. హిందీ ఆడియన్స్ ను ఓటీటీలకు దగ్గర చేసిన ఫోర్ షార్ట్ ఫిలింస్ సెగ్మెంట్. అనురాగ్ కాశ్యప్, జోయా అక్తర్, దిబకర్ బెనర్జీ, కరన్ జోహార్ లాంటి హేమా హేమీలు ఈ సినిమాకు వర్క్ చేశారు. రాధికా ఆప్టే, మనీషా కోయిరాలా, భూమ్ని ఫడ్నేకర్ తో పాటు కైరా అద్వానీలు ఈ ప్రాంఛైజ్ లో ఫుల్ కలరింగ్ ఇచ్చారు.
లస్ట్ స్టోరీస్ ఒక రకంగా ఓటీటీలకు ఆడియన్స్ ను పెంచడంలో కీ రోల్ పోషించింది. ఆ కాలుక్యులేషన్ తోటే సౌత్ లోను లస్ట్ స్టోరీస్ రూపొందించి దక్షిణాది ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకోవాలని చూస్తుంది నెట్ ఫ్లిక్స్. దానిలో భాగంగా  తెలుగు వెర్షన్ ను  హిందీలో చేసినట్లుగానే ఓ నలుగురు దర్శకులకు అప్పగించారు. వారిలో నందినిరెడ్డి, సందీప్ రెడ్ది, సంకల్ప్ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ లు మనకు కనిపిస్తున్నారు. అయితే వీరిలోంచి సందీప్ రెడ్డి వేరేకారణాలతో బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
సంకల్ప్ రెడ్డి పార్ట్ లో  ఈషా రెబ్బా నటిస్తుండగా... నందిని రెడ్డి సినిమాలో అమలా పాల్ ప్రధాన పాత్రలో హైలెట్ అవుతుంది. ఇక తరుణ్ భాస్కర్ పార్ట్ లో శృతి హాసన్ చేసిందంటున్నారు. అలా చేస్తే మిగిలిన సందీప్ రెడ్డి పార్ట్ ను ఎవరు టేకప్ చేస్తారు. ఎవరు హీరోయిన్ గా మెరుపులు మెరిపిస్తారో చూడాలి. ఇప్పుడున్న ఈ సమయంలో సందీప్ రెడ్డి ఎందుకు వెళ్లిపోయాడనే టాక్ నడుస్తుంది. బాలీవుడ్ సినిమాలతో ఉన్న కమిట్మెంట్ లతో సందీప్ సైడ్ అయ్యాడనే వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: