బాలీవుడ్ టాప్ లేపుతున్న కియరా అద్వాని..!

shami
బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ ఫాం లో ఉంది కియరా అద్వాని. తెలుగులో కూడా మహేష్, రాం చరణ్ వంటి స్టార్స్ తో ఆమె నటించి మెప్పించింది. హిందీలో ఎం.ఎస్ ధోని ముందు వరకు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు కాని ఆ సినిమా తర్వాత ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తో కియరా సూపర్ పాపులర్ అయ్యింది. ఆ వెబ్ సీరీస్ లో అమ్మడి బోల్డ్ ఎక్స్ ప్రెషన్స్ కు బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. లస్ట్ స్టోరీస్ తర్వాత కియరా కెరియర్ ఊపందుకుంది.
వరుస ఛాన్సులతో అదరగొడుతున్న అమ్మడు లేటెస్ట్ గా హృతిక్ రోషన్ క్రిష్ సీక్వల్ మూవీ క్రిష్ 4లో కూడా ఛాన్స్ అందుకున్నట్టు టాక్. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులను అందుకుంటున్న కియరా అద్వాని క్రిష్ 4లో కూడా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. బాలీవుడ్ భామ కృతి సనన్, కియరా అద్వాని ఇద్దరిలో ఒకరిని క్రిష్ 4లో సెలెక్ట్ చేస్తారని వార్తలు రాగా ఫైనల్ గా క్రిష్ 4లో కియరా అద్వానినే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.
హృతిక్ తో సినిమా అంటే అది మాములు విషయం కాదు. బాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న కియరాకి తెలుగులో స్టార్ ఛాన్సులు వచ్చినా సరే ఆమె చేయనని చెబుతుందట. తప్పకుండా కియరా బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా హీరోయిన్ గా సూపర్ పాపులర్ అయిన కియరా సౌత్ సినిమాలను ఎప్పుడు చేస్తుందో చూడాలి.                      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: