సలార్ కథను అందుకే ఒప్పుకున్నా..?

P.Nishanth Kumar
నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.  ఈ సినిమా తో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..
ఇక ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..
ఇవే కాకుండా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ సలార్ అనే సినిమా చేస్తున్నాడు.. అయితే ఇది ఉగ్రం సినిమా ని ఎక్స్ పాండ్  చేయడమే అని చెప్పగానే ప్రభాస్ ఫాన్స్ కొంత డల్ అయ్యారు. పాన్ ఇండియా స్టార్ తో రీమేక్ ఏంటని అన్నారు.అయితే దీనిపై ప్రభాస్ ఒప్పుకోవడానికి కారణం చెప్పారని తెలుస్తుంది. ఉగ్రమ్ స్టోరీ లైన్ నే తీసుకుని అంతకు మించి అన్నట్లుగా  ప్రశాంత్ నీల్ కథ చెప్పారని అన్నారట..అంతేకాదు అన్ని గ్రాఫిక్స్ మూవీస్ కాకుండా ఇలాంటి యాక్షన్ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని ప్రభాస్ భావించాడట. ప్రభాస్ దీన్ని ఒక ప్రయోగంగా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ చేస్తున్న ఈ ప్రయోగం ఏంత వరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: