ఇంట్రెస్టింగ్ : ఆదిపురుష్ లో ఆ హీరోయిన్ కన్ ఫర్మ్ అయినట్లే..?

P.Nishanth Kumar
నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, సమ్మర్ లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..
ఇక ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..
ఇక సీత పాత్ర కోసం కొంత అన్వేషణ సాగిన చివరికి కృతి సనోన్ ని ఫైనల్ చేశారని కథనాలొస్తున్నాయి. కృతి తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు మహేష్ సరసన `1నేనొక్కడినే`.. నాగచైతన్య సరసన `దోచేయ్` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు క్రేజీగా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ దక్కించుకుంటోందన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే కృతి ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఇది గాసిప్పా లేదా కన్ ఫర్మ్ న్యూస్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: