రూటు మార్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు..!

N.ANJI
గ్లామర్ షో విషయంలో హీరోయిన్ల థాట్ ప్రాసెస్ మారిపోతోంది. ఎప్పుడూ ఓకే ఇమేజ్‌ అంటే బోర్ ఫీల్ అవుతున్నారేమో.. బోల్డ్ బ్యూటీస్‌ హోమ్లీ లుక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో పరిచయమైంది పాయల్‌ రాజ్‌పుత్. మొదటి సినిమాలోనే తన గ్లామర్ తో కుర్రకారులకు వేడి పుట్టించింది ఈ భామ. తాజాగా అచ్చమైన పల్లెపడుచు లుక్‌లో ఆకట్టుకున్నారు ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఓటీటీ మూవీ ‘అనగనగా ఓ అతిథి’ కోసం లంగా ఓణీలో పద్దతిగా కనిపించింది ఆర్డీఎక్స్‌ బ్యూటీ.
ఇక పాయల్‌ బాటలోనే గ్లామర్‌ షోకు బ్రేక్‌ ఇచ్చిన మరో బ్యూటీ హెబ్బా పటేల్‌. కుమారీ 21 ఎఫ్‌ అంటూ బోల్డ్ లవ్‌ స్టోరితో పాపులర్ హీరోయిన్ లా మారిపోయింది. అయ్యినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ తరువాత ఐటమ్ నెంబర్స్‌లోనూ అదరగొట్టారు. ఇప్పుడు మాత్రం అన్ని పక్కన పెట్టేసి… ఓదెలా రైల్వేస్టేషన్‌ సినిమాలో చీర కట్టులో హుందాగా కనిపించారు ఈ భామ.
అయితే యంగ్ హీరోయిన్లు బోల్డ్ ఇమేజ్ నుంచి హోమ్లీ టర్న్ తీసుకుంటే.. స్టార్ హీరోయిన్లు మాత్రం గ్లామర్ షోకు హద్దులు చెరిపేస్తున్నారు. ఈ మధ్య మాల్దీవ్స్ బాట పట్టిన తెలుగు హీరోయిన్స్ బాలీవుడ్ కూడా షాక్‌ అయ్యేలా ఫొటోలకు పోజులిస్తున్నారు. రకుల్‌, కాజల్, సమంత.. ఈ ముద్దుగుమ్మల లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలను భద్రంగా సేవ్ చేసి పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఆ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తున్నారు ఈ బ్యూటీస్. ఈ చేంజ్‌ ఓవర్‌ వెనుక మ్యాటరేంటి.. అవకాశాల కోసమే అందాల భామలు గ్లామర్‌ షో మొదలు పెట్టారా..? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ డిస్కషన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: