ప్రభాస్ ఇచ్చిన షాక్ నుండి కోలుకోలేకపోతున్న నాగ్ అశ్విన్ !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించినది కేవలం రెండు సినిమాలు అయినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ‘మహానటి’ మూవీతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక భారీ సినిమాను అధికారికంగా ప్రకటించడంతో నాగ్ అశ్విన్ కూడ టాప్ హీరోల దర్శకుడుగా మారిపోయాడు అన్న సంకేతాలు వచ్చాయి.

ప్రభాస్ కెరియర్ లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన కూడ వచ్చింది. దీనికి తగ్గట్టే భారీ క్యాస్టింగ్ ని ఇందులో యాడ్ చేశారు. ఈ మూవీలో నటించడానికి దీపికా పదుకొనె ని భారీ పారితోషికం ఇచ్చి ఎంపిక చేసారు. అలాగే బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రలో నటింపచేయడానికి నాగ్ అశ్విన్ గట్టి ప్రయత్నాలు చేసి ఒప్పించాడు. ఈమూవీకి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావుని మెంటర్ గా కూడ తీసుకున్నారు. ఒక భారీ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందింపబడే ఈ మూవీ ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ మూవీ పూర్తి అయిన వెంటనే సెట్స్ పైకి వెళుతుందని భావించారు.

అయితే ఈలోగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీని ప్రకటించడంతో కన్ఫ్యూజన్ మొదలై ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రభాస్ ఎలా పూర్తి చేస్తాడు అని చాలామంది సందేహాలు వ్యక్త పరిచారు. ఇలాంటి పరిస్థితులలో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో నాగ్ అశ్విన్ షాక్ అయినట్లు టాక్.

ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో నాగ్ అశ్విన్ తన సినిమా మొదలు కావడానికి మరింత సమయం పడుతుందని పరోక్షంగా ప్రభాస్ సంకేతాలు ఇచ్చినట్లు ఫీల్ అవుతున్నాడు. దీనితో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా 2023 లోపు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనితో ‘మహానటి’ లాంటి మంచి సినిమా తీసినప్పటికీ నాగ్ అశ్విన్ కు సంవత్సరాల తరబడి టాప్ హీరోల డేట్స్ గురించి ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ అతడి ప్రస్తుత పరిస్థితి పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: