నాగ్ అశ్విన్ సినిమా ని ప్రభాస్ అయోమయంలో పెడుతున్నాడేంటి..?

P.Nishanth Kumar
నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.  ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..
ఇక ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..
ఇక సీత పాత్ర కోసం పలువురు పేర్లు పరిశీలిస్తున్నారట నిర్మాతలు. అయితే ఆదిపురుష్ సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ ప్రభాస్ కు నాగ్ అశ్విన్ సినిమా పై ఉండట్లేదని టాలీవుడ్ లో ఓ చర్చ జరుగుతుంది. ఆదిపురుష్ సినిమా 2022 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా స్పష్టతను ఇచ్చారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న మూవీ ఎప్పుడు అనేది అభిమానుల్లో గందరగోళంను క్రియేట్ చేస్తోంది.రాధేశ్యామ్ తర్వాత వెంటనే నాగ్ అశ్విన్ మూవీ అనుకున్నారు. కాని ప్రభాస్ రిక్వెస్ట్ తో నాగ్ అశ్విన్ ఒప్పుకుని ఆది పురుష్ తర్వాత చేసేందుకు ఓకే చెప్పాడు. ఆది పురుష్ తర్వాత మొదలు పెట్టినా కూడా 2022లోనే తన సినిమాను విడుదల చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆదిపురుష్ ఆగస్టులో విడుదల అయితే 2022లో నాగ్ అశ్విన్ విడుదల సాధ్యమా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: