ప్లాన్ మార్చుకున్న రాధేశ్యామ్.. అభిమానులు ఏమంటారో..?

P.Nishanth Kumar
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..సాహో విషయంలో ఖంగు తిన్న ప్రభాస్ ఈ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ షూట్ చేయిస్తున్నాడు ప్రభాస్.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది.. రాధే శ్యామ్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు.1970 లలో ఐరోపాలో సాగే అందమైన ప్రేమకథ కావడంతో అందుకు తగ్గట్లే లొకేషన్స్ కావాలి..అందుకు తగ్గట్లే ఈ మూవీ నేపథ్యాన్ని సన్నివేశాల్ని ఇటలీ యూరప్ దేశాలను దృష్టిలో ఉంచుకునే రాసుకున్నారు. కానీ మహమ్మారీ లాక్ డౌన్ అన్నిటినీ చెడగొట్టింది.
ఆ తర్వాత హైదరాబాద్ లో సెట్స్ వేసి చేసేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు తిరిగి తొలిగా అనుకున్నట్టే .. సెట్స్ లో కాకుండా కొత్త షెడ్యూల్ ని ఇటలీలో లైవ్ గా ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి 2021 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్. యువి క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమా లు చేయనున్నాడు ప్రభాస్.. అయితే ఈ సినిమాల వరసలు కొంత తారుమారు అవుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది..
రాధేశ్యామ్ సినిమా దాదాపుగా పూర్తవ వచ్చింది..  దాంతో వెంటనే ప్రభాస్ ఓ సినిమా చేయాలి కానీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కునా నాగ్ అశ్వని , ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్ తో , భారీ కథ తో వస్తున్న సినిమాలు దాంతో తక్కువ టైం లో ఆ సినిమాలు చేయడం కుదరని పని.. మరోవైపు కెజిఎఫ్ సినిమా దర్శకుడు ఇప్పటికే ఓ కథ చెప్పాడు.. ఈ సినిమా ను ఆ రెండు సినిమాల తర్వాత చేద్దామనుకున్నారు. కానీ చూస్తే ఆ సినిమాలు సెట్స్ మీదకి ఇప్పుడప్పుడే వెళ్లేలా కనిపించట్లేదు.. ప్రశాంత్ చెప్పిన కథ ఎంతో సింపుల్ గా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో రాధే శ్యామ్ తర్వాత ఆ సినిమా చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయ్యాడట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: