ప్లాన్ మార్చుకున్న రాధేశ్యామ్.. అభిమానులు ఏమంటారో..?
ఆ తర్వాత హైదరాబాద్ లో సెట్స్ వేసి చేసేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు తిరిగి తొలిగా అనుకున్నట్టే .. సెట్స్ లో కాకుండా కొత్త షెడ్యూల్ ని ఇటలీలో లైవ్ గా ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి 2021 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్. యువి క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమా లు చేయనున్నాడు ప్రభాస్.. అయితే ఈ సినిమాల వరసలు కొంత తారుమారు అవుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది..
రాధేశ్యామ్ సినిమా దాదాపుగా పూర్తవ వచ్చింది.. దాంతో వెంటనే ప్రభాస్ ఓ సినిమా చేయాలి కానీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కునా నాగ్ అశ్వని , ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్ తో , భారీ కథ తో వస్తున్న సినిమాలు దాంతో తక్కువ టైం లో ఆ సినిమాలు చేయడం కుదరని పని.. మరోవైపు కెజిఎఫ్ సినిమా దర్శకుడు ఇప్పటికే ఓ కథ చెప్పాడు.. ఈ సినిమా ను ఆ రెండు సినిమాల తర్వాత చేద్దామనుకున్నారు. కానీ చూస్తే ఆ సినిమాలు సెట్స్ మీదకి ఇప్పుడప్పుడే వెళ్లేలా కనిపించట్లేదు.. ప్రశాంత్ చెప్పిన కథ ఎంతో సింపుల్ గా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో రాధే శ్యామ్ తర్వాత ఆ సినిమా చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయ్యాడట..