ప్రభాస్ సినిమా కోసం పని చేస్తోన్న లెజండరీ డైరెక్టర్
దానికి కారణం ఆయన గత సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్స్ కలిసి రాకపోవడమే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. విభిన్న సినిమాల దర్శకుడు, తెలుగులో మొదటి సైన్స్ ఫిక్షన్ అయిన ఆదిత్య 369 డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్గా వ్యవహరించనున్నట్లుగా ప్రకటించింది.
ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. " ఎన్నో ఏళ్ళుగా కంటున్న కల నిజం అయింది. లెజండరీ చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు... అయన మా సినిమాలో భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం... సృజనాత్మక రచనలు మాకు మంచి మార్గదర్శకంగా ఉంటాయని కచ్చితంగా నమ్ముతున్నాం" అంటూ సింగీతం స్కెచ్ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ క్వరెంటైన్ లోనూ మా సినిమాకి సమయం కేటాయించినందుకు థాంక్స్ అని పేర్కొన్నారు. ఇక తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా సింగీతం శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారం టైన్ లోనే ఉన్నారు.