ప్రభాస్ అనౌన్స్ చేసిన వరుస సినిమాల్లో భారీ మార్పులు.. ?

P.Nishanth Kumar
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ మార్పులు చేసుకుంటున్నాయని తెలుస్తుంది.. సాహో సినిమా ఫ్లాప్ తర్వాత రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ సూటి చేయిస్తున్నాడు ప్రభాస్.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది.. రాధే శ్యామ్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమా లు చేయనున్నాడు ప్రభాస్.. అయితే ఈ సినిమాల వరసలు కొంత తారుమారు అవుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది..
రాధేశ్యామ్ సినిమా దాదాపుగా పూర్తవ వచ్చింది..  దాంతో వెంటనే ప్రభాస్ ఓ సినిమా చేయాలి కానీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కునా నాగ్ అశ్వని , ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్ తో , భారీ కథ తో వస్తున్న సినిమాలు దాంతో తక్కువ టైం లో ఆ సినిమాలు చేయడం కుదరని పని.. మరోవైపు కెజిఎఫ్ సినిమా దర్శకుడు ఇప్పటికే ఓ కథ చెప్పాడు.. ఈ సినిమా ను ఆ రెండు సినిమాల తర్వాత చేద్దామనుకున్నారు. కానీ చూస్తే ఆ సినిమాలు సెట్స్ మీదకి ఇప్పుడప్పుడే వెళ్లేలా కనిపించట్లేదు.. ప్రశాంత్ చెప్పిన కథ ఎంతో సింపుల్ గా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో రాధే శ్యామ్ తర్వాత ఆ సినిమా చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయ్యాడట..
కేజిఎఫ్ కు ముందు ప్రశాంత్ నీల్ తీసింది ఒక్క సినిమానే. దాని పేరు ఉగ్రం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సింపుల్ స్టొరీనే అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్లు, ఎలివేషన్లతో దాన్ని సూపర్ హిట్ చేసి చూపించారు. అదే ఫార్ములాని ఇక్కడా వాడబోతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ను ప్రశాంత్ ఓ రేంజ్ లో చూపించడం ఖాయం.. ఆ సినిమా ఇంత త్వరగా చూడొచ్చని ఫాన్స్ ఆశపడుతున్నారు.. ఇక ప్రశాంత్ సినిమా తో కలిపి ప్రభాస్ మొత్తం నాలుగు సినిమా లను సెట్స్ మీద ఉంచాడు.. మొత్తం నాలుగు సినిమాలకు ప్రభాస్ కమిట్ అయిపోవడం చూస్తే 2024 దాకా దాదాపు బ్లాక్ అయినట్టే. అందులోనూ రెండు పాన్ ఇండియా బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కావడం సహజమే. మరి ప్రభాస్ కెరీర్ ఈ సినిమాలతో ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో చూడాలి మరీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: